జనవరి 30: ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు మరోసారి విచారణకు రానుంది. ఈ పిటిషన్పై ఈనెల 21న కోర్టులో విచారణ జరగగా.. కౌంటర్ ఫైల్ చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇప్పుడు వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలన్నింటిని కోర్టు ముందు ఉంచాలని ఎన్ఐఏను ఆదేశించింది. విచారణపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు.. కేసు విచారణను 30వతేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈరోజు కేంద్రం కౌంటర్ దాఖలు చేయబోతోంది.