నల్లజర్ల, జనవరి 29: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ.. నలభైఏళ్ల జగన్ పథకాల్ని కాపీ కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్డులని పరీక్షల్లో కాపీ కొడితే డీబార్ చేస్తుంటారు... మరి వైసీపీ హామీలను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలి అని రోజా ప్రశ్నించారు. నల్లజర్ల మండలంలోని తెలికిచెర్ల గ్రామంలో జరిగిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో పాల్గొన్న రోజా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటోడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అప్డేటెడ్ వెర్షన్ అయితే బాబు ఔట్ డేటెడ్ వెర్షన్ అవి, గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు అని హామిలిచ్చిన చంద్రబాబు తన కొడుక్కి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. ఇటీవల పెంచిన పెన్షన్ రూ.2వేలను బాబు రెండు నెలలు మాత్రమే ఇస్తాడన్నారు. అదే జగన్కు ఓటువేస్తే జీవితాంతం ఇస్తాడని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.