ఎమ్మెల్యేకి మంత్రి సవాల్..

SMTV Desk 2019-01-28 15:38:43  Somireddy Chandramohan Reddy, Kakani Govardhan Reddy, YCP, TDP

అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య యుద్ధం ముదిరి సవాళ్లుగా మారింది. నెల్లూరు జిల్లాలోని మనుబోలులో ఆదివారం పర్యటించిన మంత్రి అక్కడి బహిరంగ సభలో మాట్లాడారు. గోవర్ధన్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన ఆయన ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటాయో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చూపిస్తానని గోవర్ధన్ రెడ్డిని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 300 కుటుంబాలు మంత్రి సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.