అమరావతి, జనవరి 19: ఆధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సోమవారం నాడు దావోస్ పర్యటనకు బయల్దేరనున్నాడు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలకు లోకేష్ హాజరుకానున్నారు. అంతేకాక ఏపి ప్రతినిధి బృందానికి మంత్రి నాయకత్వం వహించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో లోకేష్ ప్రసంగించనున్నారు. అలాగే పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశంకానున్నారు.