సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న బీజేపీ నేతలు....బాబు ఫైర్

SMTV Desk 2019-01-04 13:53:10  Chandrababu, TDP, BJP, Kakinada, Janma bhumi maa vuru

కాకినాడ, జనవరి 4: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న చంద్రబాబును జేఎన్టీయూ వద్ద బీజేపీ నేతలు అడ్డుకోవడంతో అక్కడి ప్రాంతం అంతా గందరగోలంగా మారింది. ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ వారు నినాదాలు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రబాబు నాయుడు ఏపీ అన్యాయం చేస్తున్న మోదీకి మీరేలా మద్దతిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన మోదీకి మద్దతివ్వడానికి సిగ్గుందా అంటూ మండిపడ్డారు. ఏపీకి ద్రోహం చేసిన మోదీని వెనకేసుకు వస్తారా అంటూ మండిపడ్డారు. ఈ జన్మభూమిపై ఉన్నారు ఇక్కడ నీరు తాగారు ఇక్కడ గాలి పీల్చారు అలాంటిది రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీకి సహకరిస్తారా అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.

ఓ మహిళా బీజేపీ నేతపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు సిగ్గుందా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి మంచి చెయ్యాలన్న కమిట్మెంట్ ఉందా అంటూ ధ్వజమెత్తారు. మిమ్మల్ని కొడతారు, లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటారు, ఫినిష్ అయిపోతారు అంటూ విరుచుకుపడ్డారు. దీంతో ఆ మహిళా నేత బెదిరిస్తున్నారా అంటూ నిలదియ్యడంతో నాలుక కరుచుకున్న చంద్రబాబు తాను కాదు ప్రజలు కొడతారు అంటూ సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతున్న వారిపై బీజేపీ ప్రభుత్వం నిన్న కూడా లాఠీ చార్జ్ చేయించిందని ఆ పార్టీ కార్యకర్తలని చెప్పుకునేందుకు కాస్తైనా సిగ్గుండాలంటూ మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.