అమరావతి, డిసెంబర్ 29: హై కోర్టు విభజన పై మరో సారి కేంద్రంపై ఏపీ సీఎం విరుచుకుపడ్డాడు. ఈరోజు ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సిఎం మాట్లాడుతూ విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని, సమయం కూడా ఇవ్వకుండా, అంతేకాక ఉద్యోగులు సిద్ధంగా లేకుండానే హైకోర్టును విభజించారన్నారు. కాగా జిల్లా స్థాయి సమస్యల పరిష్కారాలకు కలెక్టర్ల సమావేశం దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా, గ్రామస్థాయి ప్రణాళికల రూపకల్పన చేయాలన్నారు. 6వ విడత జన్మభూమి మాఊరు కార్యక్రమం గ్రామాలు, వార్డులలో పండగలా జరగనున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయంపై గ్రామసభల్లో అవగాహన కల్పించాలని సూచించారు.