మోడీ ఏపీ పర్యటనపై తెదేపా నేతల నిరసన

SMTV Desk 2018-12-26 12:58:25  Narendra modi, Indian prime minister, BJP, TDP, Chnadrababu

అమరావతి, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి పర్యటనను వ్యతిరేఖిస్తూ తెదేపా నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. మోడీ పర్యటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ పర్యటనపై సహాయ నిరాకరణకు కూడా పిలుపినిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరంగా మోదీ పర్యటనను బాయ్ కాట్ చెయ్యాలని బాబు ఆదేశించారు. విభజన గాయంపై కారం పూసేందుకే మోదీ వస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మోదీ సభలకు హాజరుకాకుండా గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని సీఎం ఆదేశించారు. మోదీ ఏపీలో పర్యటించి ఏం చెప్తారాని ప్రశ్నించారు. ఏపీకి చేసిందేమీ లేదని అలాంటిది ఏం చెప్తారంటూ మండిపడ్డారు. మోదీ పర్యటనకు సహాయ నిరాకరణ చెయ్యాల్సిందేనని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.