విశాఖపట్నం, డిసెంబర్ 25: రాష్ట్రంలో సుస్థిర పాలన కేవలం బీజేపీ తోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ నేత, ఎంపి హరిబాబు తెలిపారు. అంతేకాక కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్ లు స్థిరమైన పాలన అందివ్వలేవని చెప్పుకొచ్చారు. ఏపిలో మోడి పర్యటన ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదని, విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. పెండింగ్లో ఉన్న నాలుగు అంశాల పట్ల చిత్తశుద్దితో ఉన్నామని ఎంపీ తెలిపారు. రైల్వేజోన్ సాధ్యం కాదని ఉన్నతస్థాయి కమిటి నివేదిక ఇచ్చిందని, ఆవిషయం గురించి మళ్లీ ఆలోచిస్తున్నామిన ఎంపి తెలిపారు.