అమరావతి, డిసెంబర్ 24: ఆదివారం అమరావతి పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంట ఉన్న ఎపీ ఎన్నార్టీ కార్యాలయంలో కె. భవానీశంకర్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారని ఆ సంస్థ అధ్యక్షులు వేమూరు రవి ఓ ప్రకటనలో తెలిపారు. భవానీశంకర్ కర్నూలు జిల్లా ఆడిట్ విభాగం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ డి ప్యుటేషన్పై ఇక్కడకు వచ్చినట్లు పేర్కొన్నారు.