అమరావతి, డిసెంబర్ 21: రాష్ట్రంలో టిడిపి వరుస సమావేశాలతో పార్టీ వాతవరనం వేడెక్కుతుంది. తాజాగా సమన్వయ కమిటీ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా నుంచి హాజరుకాని నేతలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సీరియస్గా మాట్లాడితే బాధపడతారని పరిస్థితులు అర్ధం చేసుకుని మసలుకోవాలన్నారు. ఎన్నికలయ్యే వరకు సీరియస్గానే ఉంటానని బాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకు నేతలు తప్పనిసరిగా హాజరు కావాలని, లేకుంటే వేటు తప్పదని ఘాటుగా చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదుపై జిల్లాల వారిగా నేతలను బాబు ప్రశ్నించారు. నేతలు చేసే తప్పులతో పార్టీ పరువు మంటగలిసి పోతుందని చంద్రబాబు అన్నారు.