ఆ పార్టీలో వృద్ద నేతలకు నిరాశే...!

SMTV Desk 2018-12-21 18:16:46  Andhrapradesh assembly elections, tdp, chandrababu, Senior leaders, Party tickets

కాకినాడ, డిసెంబర్ 21: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల వారు చాల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే టిడిపి మాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతుంది. సంక్రాంతి తర్వాత తమ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు వెల్లడించారు.





అయితే పార్టీలో 1983 నుండి ఉన్న ఎమ్మెల్యెలకు టికెట్‌ దక్కడం లేదు. టిక్కెట్టు దక్కని ఎమ్మెల్యేల్లో సీనియర్లైన కొందరికి ఎమ్మెల్సీ, పార్టీలో క్రియాశీలక పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. 1983 నుంచీ రాజకీయాలలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను ఈ దఫా తప్పించనున్నారు. వీరిలో వొకరికి ఎమ్మెల్సీ, వొకరికి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి, మరొకరికి పార్టీలో క్రియాశీల పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. నేనే పోటీచేస్తానంటూ ఎవరికి వారు ప్రకటించుకున్న ఎవరికీ టిక్కెట్లు ఖరారు కాలేదు.