అమరావతి, డిసెంబర్ 14: మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో తన కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఫేస్ బుక్ లో స్పందించారు. నాయుడు బాబు తన పిలుపు కారణంగానే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని చెబుతున్నారు, కానీ ఆయన పిలుపుతో ఉలిక్కిపడి తెలంగాణలోని ప్రజలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పే అలవాటును చంద్రబాబు వదులుకోలేరని విమర్శించారు.