విజయవాడ, డిసెంబర్ 14: నదుల అనుసంధానం చేసి రాయలసీమకు పుష్కలంగా సాగునీరు అందించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సమయానికి నీరు అందటం వల్ల ఉద్యాన పంటల్లో రాయలసీమ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. రాష్ట్రాభివృద్ధిని వొక యజ్ఞంలా చేస్తుంటే కొందరు దుష్టశక్తులు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలను పరోక్షంగా విమర్శించారు.
కియా కార్ల పరిశ్రమ రావడంతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగంలో దాదాపు రూ.20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు సాయం నిలిపివేసినా, పనులు కొనసాగిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి సొంతంగానే నిధులు సమకూర్చుకుంటున్నామని చెప్పారు.