విశాఖ వెళ్లనున్న సీఎం బాబు.!

SMTV Desk 2018-12-13 11:23:17  Chandrababu, Visakapattanam Tour

విశాఖపట్టణం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేర్కొనే విశాఖలో నిర్మితమవుతున్న దేశంలోని మొదటి వైద్య ఉపకరణాల ఉత్పాదక కేంద్రం మెడ్‌ టెక్‌ పార్క్‌ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం పెదమదీనా పరిధిలో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ నిర్మించారు. ఈరోజు అనగా గురువారం ఉదయం 11 గంటలకు సీఎం పెదమదీనా చేరుకుంటారు. పార్క్‌ను ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల వరకు పార్క్‌లో నూతనంగా నిర్మించిన అబ్దుల్‌కలాం కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారు.

తరువాత కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు భీమిలి వెళ్ళి అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.అనంతరం జీవీఎంసీకి చెందిన పలు అభివృద్ధి పనులను కూడా ప్రారంబించి . తరువాత అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అలాగే చిట్టివలస జూట్‌ మిల్లు మైదానంలో ఐ హబ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.