గెలవబోయేదెవరో ప్రకటించిన లగడపాటి రాజగోపాల్

SMTV Desk 2018-11-30 17:16:00  telanaga,elections,trs,bjp,tdp,congress,bjp,jds

విజయవాడ నవంబర్ 30: మాజీ ఎంపీ, వొకప్పటి కాంగ్రెస్ ప్రముఖుడు లగడపాటి రాజగోపాల్‌, ఎన్నికల సమయాల్లో తమ సర్వేల తో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఎవరెన్ని సర్వే లు చేయించినా లగడపాటి సర్వేలకు ఉండే క్రేజ్ వేరు ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో లగడపాటి రాజగోపాల్‌ సర్వేలు నిజమయ్యాయి. గత ఎలక్షన్స్ సమయంలో అయన సర్వే అక్షరాలా నిజమవ్వడం గమనార్హం . అందుకే ఆయనను పొలిటికల్ ఆక్టోపస్ అంటారు .

లగడపాటి తాజాగా మరోసారి తెరపైకి వచ్చి తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు . ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొందని, తన సర్వే ఫలితాలను డిసెంబర్‌ 7న వెల్లడిస్తానని, అంతకుముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి " శివకుమార్‌ రెడ్డి ", ఆదిలాబాద్‌ బోథ్‌ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి "జాదవ్‌ అనిల్‌ కుమార్‌" గెలవబోతున్నారని వెల్లడించారు లగడపాటి.
రెబెల్స్‌గా బరిలోకి దిగిన వారు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు.