విజయవాడలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు అరెస్ట్

SMTV Desk 2018-10-26 17:11:20  congress, raghuveerareddy,

విజయవాడ, అక్టోబర్ 26: ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలు పలువురు విజయవాడలో అరెస్ట్ అయ్యారు. రాఫెల్‌ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు నిర్వహించింది. ఏఐసీసీ పిలుపు మేరకు విజయవాడలో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు.

మహాత్మాగాంధీ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలోకి ప్రదర్శనగా వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఇతర నాయకులను పోలీసులు ఆంధ్రరత్న భవనం వద్ద అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదంటూ అడ్డుచెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్ర రత్న భవన్‌ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు చివరకు రఘువీరారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తీసేకెల్లారు.