తిరుపతి, అక్టోబర్ 24: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతీ బుధవారం ఉదయం ప్రత్యేక దర్శన అవకాశాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్న దర్శన సమయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు అని వెల్లడించారు. అలాగే రోజువారి టోకెన్ల జారీని కేవలం బుధవారం మాత్రం 70౦ నుండి 100౦ పెంచారు. బుధవారం వారపు సేవ అయిన సహస్ర కలశాభిషేకం సేవ పూర్తయిన తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనం పూర్తి కావడానికి ఉదయం 10 గంటలు దాటుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.