విజయనగరం అక్టోబర్ 23:మంత్రి సుజయ కృష్ణ రంగారావు జగన్ పై అలాగే బొత్స నారాయణన పై సంచలన వాఖ్యలు చేసారు.తల్లి విజయలక్ష్మిని బండ బూతులు తిట్టిన బొత్స సత్యనారాయణను జగన్ చంకనేసుకుని తిరుగుతున్నారని వెల్లడించారు.బొత్స కుటుంబం ముందే పార్టీలో ఉండలేనంటూ వైసీపీలోకి తనను ఆహ్వానించినప్పుడే జగన్కు చెప్పానని.. అయినా బొత్సను పార్టీలో చేర్చుకున్నారని సుజయ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు జగన్ విమర్శించడంపై సుజయ మండిపడ్డారు. జిల్లా సరిహద్దులు దాటే లోపు తనకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.