శ్రీవారి పాదాల చెంత.. గజరాజుల సంచారం..

SMTV Desk 2018-06-11 12:18:22  srivari padalu, srivari padalu in elephants, tirupathi, tirumala

తిరుమల, జూన్ 11 : చిత్తూరు జిల్లాలోని తిరుమలలోని శ్రీవారి పాదాల చెంతకు వెళ్లే మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది. నాలుగు పెద్ద ఏనుగులు, ఓ పిల్ల ఏనుగు కలిసి రహదారిపై గుంపుగా చేరాయి. దీంతో వాహన చోదకులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. కొద్ది సమయానికి ఏనుగుల గుంపు రహదారి పక్కకు వెళ్లిపోవడంతో వాహనాలు కదిలాయి. నాలుగు రోజుల కిందట ఇదే ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో సంచరించింది. దీంతో సాయంత్రం 4గంటల నుంచి ఉదయం 9గంటల వరకు అటవీశాఖ అధికారులు ఈ మార్గాన్ని మూసివేశారు. అందువల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ మార్గంలో రాకపోకలకు అనుమతిస్తున్నారు. అయితే ఈ మార్గంలో ఏనుగుల గుంపు మరోసారి ప్రత్యక్షం కావడంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.