తిరుపతి, ఏప్రిల్ 30: విభజన చట్టం అమలు చేయనందుకే మంత్రి పదవులకు రాజీనామా చేశామని ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాలుగేళ్లు ఓపిక పట్టామని అన్నారు. బీజేపీ నేతలు చెప్పే అభివృద్ధి లెక్కలు కాగితాలకు మాత్రమే పరిమితమని, ప్యాకేజితో ఏమైనా ప్రయోజనం ఉంటుందేమోనని వేచిచూశామని, ఆనాడే కేంద్రం నుంచి బయటకు వస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చేవని, కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని సుజనా చౌదరి మండిపడ్డారు.