హైదరాబాద్, ఏప్రిల్ 25: నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించిన ఆయన వీఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీలో చేరారు. మరోవైపు వివేక మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.