దుబాయ్, ఫిబ్రవరి 27 : శ్రీదేవి మృతిపై విచారణ పూర్తయింది. ఆమె మృతిపై చాలా అనుమానాలున్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడిస్తూ కేసును పూర్తి స్థాయిలో విచారించారు. అనంతరం భౌతికకాయాన్ని భారత్కు తరలించేందుకు క్లియరెన్స్ పత్రాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ కేసును ముసివేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దుబాయ్ మీడియా సెంటర్.. "ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఆమె స్పృహ కోల్పోవడంతో బాత్టబ్లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయింది. ఇక ఈ కేసు ముగిసింది" అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి భౌతికకాయాన్ని ఎంబామింగ్ ప్రక్రియకు తరలించారు. దీంతో మూడు రోజుల నిరీక్షణ తర్వాత మొత్తానికి శ్రీదేవి భౌతికకాయం నేటి రాత్రి ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం.