నీట్ కళాశాలలో ర్యాగింగ్ భూతం..

SMTV Desk 2018-02-03 11:40:11  ragging, nit college, tadepalligudem, west godavari

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 03 : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం నీట్ కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్ధులు దాడి చేశారు. దీంతో కళాశాలలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ర్యాగింగ్ చేసిన 15 మంది సీనియర్ విద్యార్ధులుపై కేసు నమోదు చేసినట్లు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు వెల్లడించారు.