మోదీతో ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

SMTV Desk 2018-01-12 12:57:51  Chief Minister Chandrababu met Modi meeting completed

న్యూఢిల్లీ, జనవరి 12 : భారత ప్రధాని నరేంద్రమోదీతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. మోదీ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు 13 అంశాలపై ఆయనతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, నియోజకవర్గాల పెంపు, రెవెన్యూలోటు, విభజనచట్టంలోని అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అంతేగాక ప్రత్యేక ప్యాకేజీకి నిధులు కేటాయించాలని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరినట్లు కాగా, తెలిసింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కార్యకర్తలతో పూణేకు వెళ్లనున్నారు.