చిత్తూరు, జనవరి 10: ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 58వ రోజుకి చేరింది. నేడు ఉదయం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం చిప్పరపల్లి శివారు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలకు భరోసా ఇస్తూ జగన్ తన యాత్రను కొనసాగిస్తున్నారు. చిప్పరపల్లి శివారు నుంచి జెట్టివానిఒడ్డు మీదుగా జెక్కిదొన చేరుకుని అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం గంటావారిపల్లి, బొట్లవారిపల్లి, చిన్నబొట్లవారిపల్లి మీదుగా నల్లవెంగనపల్లి, మటూరు క్రాస్ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పాతగుంట, చెన్నుగారిపల్లి, గుండుపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.