విజయవాడ, జనవరి 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో విజయవాడలో నిర్వహించిన అమరావతి మారథాన్ రన్లో విజేతగా నిలిచినా వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జియో ఫోన్ను అందజేశారు. బెజవాడలో నగర వాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ...మరావతి మారథాన్ రన్లో తాము భాగాస్వాములవడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 4జీ టెలికాం సేవలను అందిస్తూ రిలయన్స్ జియో బ్రాండ్ ఇప్పటికే ప్రతి ఒక్కరికీ చేరువైందనది, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.