తిరుపతిలో ఇండిగో సర్వీసులు ప్రారంభం..

SMTV Desk 2018-01-07 15:41:42  Aviation Minister, Ashok Gajapathy Raju, Indigo airlines.

తిరుపతి, జనవరి 7 : విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పండితులు ఆశ్వీరచనాలు పలికి శేషవస్త్రంతో ఆయనను సత్కరించారు. అనంతరం మంత్రి తిరుపతిలో ఇండిగో సర్వీసులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఎంపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాలకు విమానయాన సర్వీసులను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. ఆదాయంలో ఏపీలోని విమానాశ్రయాలు ముందున్నాయన్నారు. కాగా విమానాశ్రయాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తామని వెల్లడించారు.