విజయనగరం, జనవరి 5 : జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొబ్బిలిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ని నాలెడ్జ్ హబ్గా తయారుచేయాలన్నది నా సంకల్పం. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి మాత్రమే ఉంది. పేదరిక నిర్మూలన ఒక విద్య వల్లే సాధ్యమౌతుంది. పిల్లలను బాలకార్మికులుగా ఉపయోగించుకుంటే క్షమించరాని నేర౦, తల్లిదండ్రులకు ఎన్ని కష్టాలున్నా పిల్లలను మాత్రం స్కూల్కు పంపాలి. జన్మభూమి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నా" అని వెల్లడించారు.