విజయవాడ, జనవరి 5 : డిసెంబర్ 26 వ తేదీన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ వేళలు దాటిన తర్వాత పూజలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజా నిజాలను తేల్చడానికి ఆలయ నిర్ధారణ కమిటీ విచారణ ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుశారం దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో దేవాదాయశాఖ ఇన్ఛార్జి అదనపు కమిషనర్ రఘునాథ్(పెనుగ్రంచిపోలు)తో పాటు ఆగమశాస్త్ర సలహా బోర్డు సభ్యుడు చిర్రావుల శ్రీరామశర్మ(రాజమహేంద్రవరం)లను సభ్యులుగా నియమించారు. అసలు ఆరోజు రాత్రి శాస్త్రానికి విరుద్ధంగా దేవాలయంలో ఏమైనా జరిగిందా? అందులో లోటు పాట్లు ఏమిటి? అనే విషయాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.