మహిళలు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారు :సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-01-05 14:17:37  ap cm chandrababu nai, janma bhumi, vishakhapanam

విశాఖపట్నం, జనవరి 5 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జన్మభూమి-మావూరు కార్యక్రమం మూడు రోజులు పూర్తిచేసుకుంది. ఈ కార్యక్రమంతో రాష్ట్రం మొత్తం సందడి నెలకొంది. నాలుగోవ రోజైన నేడు విశాఖపట్నంలోని నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ధర్మసాగరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతిని అభినందిస్తున్నానని అన్నారు. నర్సీపట్నం మహిళలు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారని, ఇంటింటికి కుళాయిలు ఇచ్చేందుకు మంచినీటి పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మార్చిలోగా వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగాలన్నారు.రాష్ట్రంలో 2లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని, త్వరలో గృహ ప్రవేశాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.