కైరో, డిసెంబర్ 29: ఈజిప్టు రాజధాని కైరోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హెల్వాన్ ప్రాంతంలోని చర్చి ప్రాంగణంలోకి కొందరు ఉగ్రవాదులు చొరబడి అక్కడ ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉగ్రవాదితో సహా 10 మంది మృత్యు వాత పడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చర్చిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. మరో ఉగ్రవాది పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రదాడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.