తిరుమల, డిసెంబర్ 23: తిరుమల తిరుపతి వేంకటేశా... ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద.. గోవిందా.. అంటూ నమష్కారం చేసుకునే తిరుమల శ్రీవారి భక్తులకు ఆర్జిత సేవా టిక్కెట్లు లభించడం ఓ వరం. తితిదే ప్రారంభించిన ఆన్లైన్ లక్కీడిప్ ద్వారా ఇప్పటి వరకు ఏడుసార్లు ఆన్లైన్ టిక్కెట్లు భక్తులకు అందుబాటులో తెచ్చారు. తాజాగా డిసెంబరు 8న 10,200 టిక్కెట్లు భక్తులకు కేటాయించారు. వీటి కోసం దేశవిదేశాల నుంచి లక్షన్నర మంది పోటీపడ్డారు. సుప్రభాతం, కల్యాణోత్సవం, విశేషపూజ, సహస్ర కలాశాభిషేకం, అర్చన, తదితర సేవలకు విభాగాల వారీగా ఖాళీలను అనుసరించి ఆన్లైన్లో లక్కీడిప్ తీస్తున్నారు. ఆన్లైన్ డిప్నకు భక్తుల స్పందన పెరగడం శుభ పరిణామంగా తితిదే భావిస్తోంది.