తిరుమల, డిసెంబర్ 10 : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్న హోటళ్లపై భారీ రుసుము విధించింది. రెస్టారెంట్లు, జనతా క్యాంటీన్ల పేరుతో నడిచే 15 హోటళ్లను బలవంతంగా మూసివేస్తోంది. నెల అద్దెతో పాటు అపరాధ రుసుము వెంటనే చెల్లించాలని నోటీసులు జారీచేసింది. రుసుము చెల్లించకపోవడంతో 15 హోటళ్లను మూసివేసింది. ఈ పరిణామంతో హోటళ్ల యజమానులు ఆందోళన చెందారు.