ఇస్లామాబాద్, డిసెంబర్ 08 : అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన డ్రోన్లపై పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ సొహైల్ అమన్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నెల 7న సొహైల్ అమన్ మీడియాతో మాట్లాడుతూ...‘మా గగనతలంలోకి మరొకరిని రానివ్వం." అంటూ డ్రోన్లు కన్పిస్తే వాటిని అక్కడికక్కడే కూల్చేయాల్సిందిగా షూట్ఎట్ సైట్ ఆర్డర్లు జారీ చేసినట్లు వెల్లడించారు. గత పదమూడు ఏళ్లుగా అమెరికా.. అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఉగ్రవాదులను గుర్తించి అరికట్టేందుకు అమెరికా ఈ డ్రోన్లను జనావాస ప్రాంతాల్లోనూ ప్రయోగించింది. ఇటీవల అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్లతో అమెరికా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్చీఫ్సొహైల్ పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ ఈ మేరకు ప్రకటించారు.