నిరుద్యోగ యువతకు వాహనాల పంపీణీ

SMTV Desk 2017-11-29 13:05:01  AP Sachivalayam, ap cm chandrababu naidu,

అమరావతి, నవంబర్ 29 : ఎన్టీఆర్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ కాపు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు వాహనాల పంపీణీని ప్రారంచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారు డ్రైవర్లను ఓనర్లుగా మార్చేందుకు ఈ ప్రక్రియ ఎంతో దోహదపడిందన్నారు. నిరుద్యోగులకు ఇలాంటి వినూత్న ఆలోచనలతో నిరుద్యోగుల జీవన ప్రమాణాలను మార్చవచ్చని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నిరుద్యోగులకు ఎన్టీఆర్‌ ట్రస్టు డ్రైవింగ్‌లో నైపుణ్య శిక్షణ ఇవ్వగా వారికి సొంతంగా వాహనాలు కొనుక్కునేందుకు కాపు కార్పోరేషన్‌ ఆర్థికసాయం చేసి, కొనుగోలు చేసిన వాహనాలకు ఉపాధికి ఢోకా లేకుండా ఓలా సంస్థ చేయూతనిచ్చింది. మొత్తం కోటి 20లక్షల రూపాయలతో 16 హోండా యాక్సెంట్‌ వాహనాలను ఆయన అమరావతి సచివాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.