విజయవాడ, నవంబర్ 23 : గతంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్తు మరణాంతరం ఎట్టకేలకు పదవి బాధ్యతలు చేపట్టిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి నేడు టీడీపీ లో చేరనున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన ఈయన కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ లో అధికారిగంగా చేరేందుకు ఆయన నియోజక వర్గానికి చెందిన 60 అనుచరులతో కిశోర్కుమార్రెడ్డి విజయవాడ చేరుకున్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో ఎంపీసీటీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, సహకార సంఘాలు కూడా పార్టీలో చేరనున్నట్లు వర్గాలు తెలిపాయి.