నది స్నానానికి వెళ్లి అత్తా-కోడలు గల్లంతు...

SMTV Desk 2017-11-19 11:15:23   Missing case, gunturu, thadepalli

గుంటూరు, నవంబర్ 19: గుంటూరు జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తాడేపల్లిలో నది స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు కావడం వల్ల అత్తా-కోడలు ఇద్దరు కలిసి ఉదయం నది స్నానానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు వారిద్దరూ ఆ నదిలో కొట్టుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి, అత్తా మృతదేహాన్ని వెలికి తీశారు. ఇంకా కోడలి మృతదేహం ఆచూకి లభ్యం కాలేదు. ఒకే ఇంట్లో అత్తా కోడలి మరణంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.