తూర్పుగోదావరి, నవంబర్ 3 : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా, మామిడి కుదురు మండలంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలో అటు వైపుగా వెళ్తున్న ఆటోను డిసిఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. మృతులు పాశర్లపూడి లంకకు చెందిన చెరుకూరి పాపారావు(26) దంగేటి సుబ్రహ్మణ్యం(22)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను పోస్టుమార్టంకు ఆసుపత్రికి తరలించారు.