తూర్పుగోదావరి, అక్టోబర్ 30 : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణములో వైఎస్ఆర్సీపి రాష్ట యువజన నాయకుడిపై ఎస్సై నాగరాజు దౌర్జనం చేశాడు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ఆరోపిస్తూ జక్కంపుడి రాజాను అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే.. రామచంద్రపురం ట్రాఫిక్ లో ఉన్న జక్కంపుడి రాజా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి౦చారని, నివారించడానికి వెళ్ళిన ఎస్సై నాగరాజు కాలర్ పట్టుకొని విధులకు ఆటంకం కలిగించారని అతడిని అరెస్ట్ చేసారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాను వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తూ. గో. రిపోర్టర్ - ఆనంద్