తూర్పు గోదావరి, అక్టోబర్ 26 : ప్రముఖ సినీ నిర్మాత బెల్లం కొండ సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామి, అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారికి 3000 కొబ్బరికాయల మొక్కుబడి చెల్లించారు.