ఏపీ లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరి పై మరొకరు తారాస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలుచేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై చింతమనేని పై వ్యాఖ్యలు చేసారు. "మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన దుశ్శాసనుడు చింతమనేని ప్రభాకర్ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలట. మీ బంధువైతే ఇంటికి పిలిచి మర్యాదలు చేయండి చంద్రబాబు గారూ. ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే. పోలీసులకు పచ్చ యూనిఫామ్ వేసిన చరిత్ర మీదే".
"మద్య నిషేధంపై అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశలోఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను 40 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించారు. బెల్టుషాపులు ఎగిరిపోయాయి. మద్యం విక్రయాల సమయం తగ్గింది. ఇక తనివితీరా ఏడవండి పార్టనర్లూ.అంటూ వ్యాఖ్యలు చేసారు. మరి ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.