కాకినాడ ప్రజలు చంద్రబాబు అభివృద్ధి కోసం పడుతున్న కష్టం గుర్తించారు: కళా వెంకట్రావు

SMTV Desk 2017-09-01 12:27:49  Kakinada, Corporation election results, TDP, TDP AP, Kala Venkata Rao

అమరావతి, సెప్టెంబర్ 1: కాకినాడ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీ పసుపు వర్ణం కావడంతో ఆ పార్టీ నేతలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఫలితాల్లో ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధే తెదేపాను ప్రజలకు మరింత చేరువ చేసిందని, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టం ప్రజలకు అర్థమయ్యే ఈ విధమైన తీర్పు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినప్పటికీ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఆయన అన్నారు.