స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు

SMTV Desk 2019-08-21 13:15:33  

ఇంధన ధరలు బుదవారం(ఆగస్ట్21)నాడు నిలకడగా కొనసాగాయి. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.34 వద్ద, డీజిల్ ధర రూ.70.95 వద్ద స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.76.09 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.70.37 వద్ద నిలకడగానే ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.75.72 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.70.02 వద్ద నిలకడగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కదిలాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.71.84 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.65.11 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర స్థిరంగా రూ.77.50 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.68.26 వద్ద నిలకడగా ఉంది.