చంద్రబాబు జగన్ నామస్మరణ చేస్తున్నారు

SMTV Desk 2017-06-03 15:16:20  roja, ysr cp mahila president, cm chendrababu

హైదరాబాద్, జూన్ 3 : ప్రచారం కోసమే ప్రజాధనాన్ని వృధా చేస్తు దొంగ దీక్షలు చేస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం నేతలను తరిమికొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, శాసన సభ్యురాలు రోజా పిలుపు నిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిందని ప్రజలంతా బాధల్లో ఉంటే పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని..తెలంగాణాలో ఒక రోజే సంబరాలు చేస్తూంటే ..ఆంధ్రాలో నవనిర్మాణ దీక్ష పేరుతో ఏడు రోజులు సంబరాలు చేస్తు న్నా రని విమర్శించారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఏపి నదులను, ఆస్తులను, ఆఖరికి రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టి కొత్తగా దీక్ష పేరుతో ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావా చంద్రబాబు అని నిలదీశారు. చంద్రబాబు చేసే దీక్ష నారావారి నయవంచక దీక్ష, నారావారి విధ్వంసపు దీక్ష అని అభివర్ణించారు. చేసిన పాపాలు కడుక్కోవడానికి రాక్షసులంతా శ్రీహరినామస్మరణ చేస్తారని, కానీ చంద్రబాబు, తాను చేసిన పాపాలు కడుక్కోవడానికి వైఎస్ జగన్ నామస్మరణ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.