కాకినాడ, ఆగస్ట్ 26: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ 15 రోజులకు పైగా నంద్యాలలోనే ఉంటూ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ... ఎండను, వానను కూడా పట్టించుకోకుండా రోడ్ షోలలో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో నేడు ఆయన కాకినాడ పర్యటన వాయిదా పడింది. కాగా, నేటి నుండి ఆయన కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.