17 ఏళ్ల బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు... మత్తు మందు ఇచ్చి ఆపై ...

SMTV Desk 2019-05-09 13:06:49  Sexual harrasment, rape,

హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మీర్‌పేట్ పీఎస్ ప్రాంతమైన ప్రశాంత్‌నగర్‌లో 17 ఏళ్ల బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు.. ఆ బాలికకు ఐస్‌క్రీమ్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

అదేవిధంగా ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి ఆ అమ్మాయికి మామ అవుతాడని.. బాలికపై సవతితల్లి అన్న మల్లేష్‌ అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీర ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు మల్లేష్.

అంతేకాకుండా ఈ విషయం బయటకు రావడంతో బాలికను కొట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి బాలికపై అత్యాచారం చేయడం.. ఆపై హత్య చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి.