కొలంబో: శ్రీలంక పోయిన నెల వరుస బాంబులతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైయ్యింది. ఈ దాడుల్లో దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 500 మంది గాయాలపాలయ్యారు. కొలంబో ఉగ్రదాడుల నుంచి శ్రీలంక కోలుకుందన్నారు ఆ దేశ రక్షణశాఖ. వరుస పేలుళ్ల ఘటనల తర్వాత అప్రమత్తం అయ్యామని, ప్రత్యేక భద్రత ప్రణాళికను అనుసరిస్తున్నామని తెలిపింది. ఉగ్ర కుట్రలను గుర్తించి, నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు సైనిక అధికారులు. ఇప్పటికే విధ్వంస సూత్రధారులను, వారితో సం బంధాలు కలిగువున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. భద్రత గురించిన అసత్య ప్రచారాలు నమ్మొ ద్దని, ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు అధికారులు.