హైదరాబాద్: హైదరాబాడ్ లోని వారసిగూడలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఓ మైనర్ బాలుడు నడుపడానికి ప్రయత్నించిన టాటా ఏస్ వాహనం బీబీత్సం సృష్టించింది. ప్రమాదవశాత్తు టాటా ఏస్ మనుషులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా..ఇద్దరికి గాయాలయ్యాయి. వారసిగూడలో శుభకార్యం జరుగుతోన్న ప్రాంతంలో టాటా ఏస్ వాహనాన్ని డ్రైవర్ ఆపి బండిని ఆన్లోనే ఉంచి పక్కనే ఉన్న పాన్షాప్లోకి వెళ్ళాడు. అప్పుడు ఓ బాలుడు వచ్చి బండిని నడిపేందుకు వాహనాన్ని రేజ్ చేశాడు. అది వేగంగా బ్యాండ్ వాయిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.