యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామారం మండలంలో హాజీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను హత్యచేసిన సైకో శ్రీనివాస్ రెడ్డికి భువనగిరి కోర్టు రెండువారాలు జ్యూడిషియల్ కస్టడీ విదించింది. పోలీసులు అతనిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. హాజీపూర్ గ్రామంలో శ్రావణి, మనీషా, కల్పన అనే ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. అతను వృత్తిరీత్యా లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తుంటాడు. కనుక తరచూ వివిద ప్రాంతాలలో తిరుగుతుంటాడు. అతని ఫేస్బుక్లో అనేకమంది అమ్మాయిల పేర్లను కనుగొనడంతో అతను ఇంకా హత్యలు చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కనుక అతనిని విచారించేందుకు తమకు అప్పగించవలసిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరబోతున్నట్లు తెలుస్తోంది.