అమరావతి: మే మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇంటర్ మార్కులను కూడా అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డును ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్ కోసం మార్కులివ్వాలని సీఎస్ సూచించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.